Breaking News

కర్ణాటకలో మహిళల ఫ్రీ బస్ సౌకర్యం భారం: బస్సు ఛార్జీల పెంపు

కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం భారం భరించలేక బస్సు ఛార్జీలను 15% పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా KSRTC మరియు BMTC బస్సుల్లో జనవరి 5 నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా మంత్రి HK పాటిల్ ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు రూ.417 కోట్ల భారం పడుతుందని, తాజా ఛార్జీల పెంపు వల్ల రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం సాధ్యమవుతుందని తెలిపారు. అంటే, నెలకు సుమారు రూ.240 కోట్లు ఆదాయం పెరుగుతుందని అంచనా.సామాన్య ప్రజలకు ఈ ఛార్జీల పెంపు కొంత భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మహిళల సౌకర్యం కోసం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని మంత్రి పాటిల్ వెల్లడించారు.

ఫ్రీ బస్ స్కీమ్ వివరాలు
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే శక్తి పథకం వల్ల ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ ప్రయోజనాల సమీక్షను రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగా, పెరుగుతున్న ఆర్థిక భారం వల్ల ఛార్జీల పెంపు అనివార్యమైంది.

సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి సావిత్రీబాయి ఫూలే

ప్రయాణికుల ప్రతిస్పందన
ఇదిలా ఉండగా, బస్సు ఛార్జీల పెంపుపై సామాన్య ప్రయాణికులు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ చర్యలపై మరింత సమాచారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *